Header Banner

పాక్ జెట్స్ నేలమట్టం, ఈ సారి S-400 కాదు! అర్ద్రరాత్రి ఆపరేషన్ లో..!

  Sat May 10, 2025 15:18        India

ఆపరేషన్ సింధూర్ లో పాక్ సైన్యానికి మరో భంగపాటు. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల పైన పాక్ డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తోంది. భారత్ సమర్దవంతంగా తిప్పి కొడుతోంది. ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలోని గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. ఇప్పుడు ఈ జెట్స్ ను ఎస్ 400 తో కాదు.. ఆకాశ్ అనే మరో ఆధునిక ఢిపెన్స్ వ్యవస్థను రంగంలోకి దించింది. అటు పాక్ లోని ఢిపెన్స్ కేంద్రాల పైన భారత్ దాడికి దిగింది అక్కడి సైన్యం గగ్గోలు పెడుతోంది. భారత్ ఏ స్థాయిలో అయినా పాక్ కు ధీటుగా బదిలుస్తోంది.



జెట్స్ కూల్చివేత

దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులకు యత్నించగా భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్‌ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా, భారత్‌ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్‌ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్‌ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్‌ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు సంధించింది. అయితే వాటిని భారత్ సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. ముఖ్యంగా శ్రీనగర్‌ విమానాశ్రయం, అవంతీపొరా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేలకూల్చింది.


ఇది కూడా చదవండి: వారికి ప్రతి నెలా రూ. 5000.. ఇంటి వద్దకే..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం!

 

జనావాసాలపై దాడికి

జమ్ము, ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, బాడ్‌మేడ్, భుజ్‌ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. అయితే పంజాబ్‌లోని ఫిరోజ్‌ పూర్‌లో జనావాసాలపై పాకిస్థాన్ డ్రోన్‌ దాడి చేయగా, అది ఓ భవనంపై పడింది. అందులో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత్ జెట్స్ పైన ఈ సారి భారత్ ఆకాష్‌ మిసైల్‌, L-70, Zu-33, షిల్కా వినియోగించింది. దీంతో, పాక్ పన్నాగం బెడిసి కొట్టింది. శ్రీనగర్‌లో ఉదయం రెండు పేలుళ్లు జరిగాయి. రాత్రంతా సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులు జరిగాయి. భారత్ దాడులతో పాక్ వైమానిక వ్యవస్థ ధ్వంసం అయినట్లు పాక్ ఆరోపిస్తోంది. తమ దేశంలోని మూడు ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడిందని పాక్ సైన్యం ప్రతినిధులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PakistanProvocation #ZeroToleranceForTerror #AirForceVictory #BorderSecurity #NationalSecurity #DefendingIndia #IndianArmyPower